62కి చేరిన భూకంప మృతుల సంఖ్య

జపాన్‌ భూకంపం మరణాల సంఖ్య 62కి చేరింది. ఇషికావా ప్రాంతంలోనే ఎక్కువ మరణాలు సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై స్పందిస్తూ ప్రతి ఒక్కరిని కాపాడుకునేలా చర్యలు చేపట్టాలని ప్రధాని ఫ్యూమియో కిషీడా పేర్కొన్నారు. అనంతరం జపాన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారం రోజుల్లో మరో భయంకరమైన భూకంపం వచ్చే అవకాశం ఉందని మంత్రి హయాషి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్