ప్రముఖ సినీనటుడు ప్రభాస్ జపాన్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడి ఉత్తర తీరంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి స్పందించి, ప్రభాస్ క్షేమంగా ఉన్నారని తెలిపారు. 'బాహుబలి: ది ఎపిక్' ప్రచారంలో భాగంగా ప్రభాస్ జపాన్లో ఉన్నారు.