యూపీలో ఆదివారం భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.49 గంటల సమయంలో సోన్భద్రలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.