గుజ‌రాత్‌ను వ‌ణికించిన‌ భూకంపం.

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో గురువారం ఉదయం 9.52 గంట‌ల‌కు రిక్టర్ స్కేల్‌పై 3.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. బేలాకు నైరుతి దిశ‌లో 16 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మైన‌ట్లు ఐఎస్ఆర్ తెలిపింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కచ్ జిల్లా భూకంపాలకు అధిక ప్రమాద ప్రాంతంగా గుర్తింపు పొందింది. 2001లో ఇక్కడ భారీ భూకంపం సంభవించి 13,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత పోస్ట్