ఎండిన రొయ్యలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కాల్షియం, ఐరన్, మేగ్నీషియం, ఫాస్పరస్, పోటాషియం, జింక్, సెలీనియం, అయోడిన్, రాగి, మాంగనీస్, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎండిన రొయ్యలను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిలో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.