దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో ఈ తనిఖీలు జరిగాయి. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తనిఖీల సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో విద్యార్థులను మోసం చేస్తున్నాయని, NMC ప్రమాణాలు పాటించకుండానే అనుమతులు పొందుతున్నాయనే ఆరోపణలున్నాయి. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ సోదాలు చేపట్టింది.