రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్.. రూల్స్ ముందు బంధుత్వం పనికిరాదని నిరూపించారు. సీనియర్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షకు ఆలస్యంగా చేరుకున్న మంత్రి మేనకోడలు సీమా పరిహార్ను అధికారులు లోపలికి అనుమతించలేదు. సహాయం కోరగా మంత్రి కూడా "రూల్స్ అందరికీ ఒకేలా వర్తిస్తాయి, ఆలస్యంగా వచ్చిన వారికి ఎంట్రీ లేదు" అని తేల్చి చెప్పారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా, మంత్రిని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తే, మరికొందరు విమర్శిస్తున్నారు.