ఎల్‌నినో ఎంట్రీ.. రానున్న రోజుల్లో రికార్డు స్థాయికి చేరనున్న ఉష్ణోగ్రతలు

భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా ఎల్‌నినో ప్రారంభమైనట్లు ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఈ పరిస్థితి, నైరుతి రుతుపవనాల సమయంలో మరింత బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో భూమిపై పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది నీటి కొరతకు, వ్యవసాయానికి తీవ్ర నష్టానికి దారితీసి, కరువు పరిస్థితులను సృష్టించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, క్లౌడ్ బరస్టులు వంటి విపత్తులు కూడా సంభవించవచ్చు.

సంబంధిత పోస్ట్