తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో మూడు, ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు EC షెడ్యూల్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణకు తుది గడువుగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.