జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చన్‌పోరా గ్రామంలో శనివారం రాత్రి భద్రత బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు జాకీర్ అహ్మద్ గనీ, లతీఫ్ భట్‌ మృతి చెందారు. ఇందులో జాకీర్ అహ్మద్ గనీని వీలైనంత త్వరగా పట్టుకోవాలని గతంలో ఎన్‌ఐఏ కోర్టు కూడా ప్రకటన విడుదల చేసింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది అయిన జాకీర్ అహ్మద్.. గతంలో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలోనూ కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్