లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్నైట్ స్కోర్ 251/4 పరుగుల వద్ద ఇంగ్లండ్ బ్యాటర్లు ఆటను ప్రారంభించారు. జో రూట్(103*) తన కెరీర్లో 37వ శతకాన్ని నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 260/5. మరోవైపు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ రెండో రోజు ఆటలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ధ్రువ్ జురెల్ కీపింగ్ కొనసాగిస్తున్నాడు.