లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య మూడో టెస్టు రెండో రోజు కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 14 ఓవర్లు ఆడి వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 13, కరుణ్ నాయర్ 18 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. కాగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో స్లిప్స్లో హ్యరీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (13) ఔట్ అయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ 387 పరుగులు చేసి ఆలౌట్ అయింది.