అండర్సన్-టెండూల్కర్ సిరీస్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జెమీ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించారు. జెమీ స్మిత్ 52 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. నితీష్ వేసిన 104వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసి జెమీ స్మిత్ అర్ధశతకం అందుకున్నారు. టెస్ట్ కెరీర్లో జెమీకి ఇది 6వ అర్ధశతకం. దీంతో 105 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 353/7గా ఉంది.
Credits: ECB, IG