అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఐదో రోజు ఆట కొనసాగుతోంది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 70 ఓవర్లలో 163 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 150 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. భారత్ను గెలిపించేందుకు జడేజా ఒంటరి పోరాటం చేస్తున్నారు. భారత్ విజయానికి ఇంకా 30 పరుగులు అవసరం. రవీంద్ర జడేజా (56*), సిరాజ్ (2*) క్రీజులో ఉన్నారు.