విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు

బ్రెజిల్‌లోని సౌ పోలో నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎడమ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన 9 నిమిషాలలోపే ఈ ఘటన జరగడంతో, అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి సౌ పోలో ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటనతో విమానంలోని సిబ్బందితో సహా 300 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు, తద్వారా ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్