ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్లో తొలి సెమీఫైన మ్యాచ్ బుధవారం జరగనుంది. గువాహటి వేదికగా జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ - సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచి ఐదో ట్రోఫీపై గురి పెట్టాలని చూస్తుండగా తొలిసారి సెమీస్ చేరిన సౌతాఫ్రికా ఫైనల్ చేరాలని భావిస్తోంది. ఒకవేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుకుంటుంది.