ఈపీఎఫ్‌వో గుడ్‌ న్యూస్.. ఇకపై ఏటీఎంలో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా!

ఈపీఎఫ్‌వో చందాదారులకు త్వరలో గుడ్‌ న్యూస్ చెప్పనుంది. పీఎఫ్ ఖాతాలోని నగదును మరింత సులభంగా ఏటీఎం వద్ద విత్‌డ్రా చేసుకునే విధానం అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు కార్మిక శాఖ సెక్రటరీ సుమితా దావ్రా బుధవారం కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈపీఎఫ్‌వో చందాదారులు తమ పీఎఫ్ ఫండ్‌ను నేరుగా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని వెల్లడించారు. కాగా ఈపీఎఫ్‌వోకు మొత్తం 7 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్