EVMల పనితీరుపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ-జేడీఎస్ కూటమి అత్యధిక సీట్లు గెలవడానికి EVMలే కారణమని ఆయన ఆరోపించారు. EVMలను తీసేసి.. మళ్లీ బ్యాలెట్ విధానం తేవాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లో 29 సీట్లకు గాను బీజేపీ 29 చోట్ల గెలవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు.