మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. జగన్ బుధవారం గుంటూరు మార్కెట్ యార్డులో పర్యటించనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో జగన్ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించారు. అయినా తమ అధినేత గుంటూరులో పర్యటిస్తారని వైసీపీ శ్రేణులు ఢంకా బనాయించి చెప్పడంతో జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.