సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అల్లుఅర్జున్ను ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్కు తరలిస్తున్నారు. బెనిఫిట్ షో రోజున తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే.