EXCLUSIVE VIDEO: చిత్తూరులో కాల్పుల కలకలం

AP: చిత్తూరు గాంధీ రోడ్డులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ భవనంలోకి చొరబడిన దొంగల ముఠా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఇంటి యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా మోహరించారు. స్థానిక ప్రజలను ఖాళీ చేయించారు. తుపాకులతో పోలీసులూ రంగంలోకి దిగారు. ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. భవనంలో ఇంకొందరు దొంగలున్నట్లు సమాచారం. దొంగల వద్ద తుపాకులు ఉండటంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది.

సంబంధిత పోస్ట్