విద్యార్థులు, యువత అధికంగా బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్నారని BRS నేత హరీశ్ రావు అన్నారు. అలా చేయడం సరికాదని, బెట్టింగ్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. కొందరు కుటుంబ సభ్యులను చంపేసి తమ ప్రాణాలు తీసుకుంటున్నారని చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న ఆశ మంచిది కాదన్నారు. శ్రీ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సిద్ధిపేట(D) రాంపూర్లో శ్రీరాముని రథోత్సవంలో హరీశ్ పాల్గొని మాట్లాడారు.