ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడంపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఫిరాయింపులు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాతీర్పునకు విరుద్ధమని ఆప్ నాయకులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని, వారి సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్కు వినతిపత్రం సమర్పించారు.