ఢిల్లీలో పేలుడు.. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ షట్‌డౌన్

ఢిల్లీ బాంబ్‌ బ్లాస్ట్‌ ప్రభావంతో ఎర్రకోట మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ వద్ద హ్యుందాయ్ ఐ20 కారు పేలుడుతో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫోరెన్సిక్, NIA, NSG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. భద్రతా కారణాల వల్ల 500 మీటర్ల పరిధిలో నో ఎంట్రీ జోన్ ఏర్పాటు చేయగా, మెట్రో సేవలు తదుపరి ఆదేశాల వరకు నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్