వరుస టీ20 పరాజయాలతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జట్టు ప్రదర్శన అభిమానులను నిరాశపరుస్తోంది. సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ 52 టీ20ల్లో 42 విజయాలు సాధించిందని, 2026 టీ20 ప్రపంచకప్ను కూడా గెలిచిందని అభిమానులు గుర్తు చేస్తున్నారు. శ్రేయస్ కెప్టెన్సీలో 4 మ్యాచ్ల్లో మూడు ఓటములు, ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఐర్లాండ్తో సిరీస్ కోల్పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే SKYను మళ్లీ కెప్టెన్గా నియమించాలని అభిమానులు కోరుతున్నారు.