TG: బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని రైతుల ఆందోళన చేశారు. నెన్నెల మండల కేంద్రంలో 20 సంవత్సరాలుగా పంటలు వేస్తున్న తమ భూములల్లో అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా పత్తి మొక్కలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వినోద్, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.