TG: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న ఏడుగురు స్నేహితులు నాగార్జునసాగర్లోని వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా, అర్ధరాత్రి వారి కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయితేజ, పవన్, రాఘవేంద్ర అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.