AP: చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. కూతురు కౌసల్య ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డారు. పెద్దల సమక్షంలో కూతురుని, అల్లుడి చంద్రశేఖర్ని రాజీకి పిలిచిన తండ్రి.. వాళ్ల సమక్షంలోనే ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కౌసల్య, చంద్రశేఖర్ సహా నలుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ప్రేమజంటని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు.