పంజాబ్లోని లూథియానాలో మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది. స్కూల్ నుంచి తన బిడ్డను బైక్పై తీసుకువస్తున్న ఒక తండ్రి, అదుపుతప్పి రోడ్డుపై తెరిచి ఉన్న మురికినీటి గుంతలో పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై SMలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బహిరంగంగా ఉన్న మ్యాన్హోల్స్ను మూసివేయడంలో అధికారుల వైఫల్యంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు.