TG: ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని అంబేద్కర్నగర్లో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఇంటి అమ్మకం విషయంలో జరిగిన గొడవలో మద్యం మత్తులో ఉన్న తండ్రి కొత్తపల్లి సీతారాములు.. తన కుమారుడు కిరణ్కుమార్ను కత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. కిరణ్కుమార్ భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.