ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వయసున్న SP నాయకుడు, మాజీ కౌన్సిలర్ హాజీ ఖలీల్ 20 ఏళ్ల యువతిని నాలుగో వివాహం చేసుకున్నాడని అతని మొదటి భార్య నజ్రీన్ ఆరోపించారు. ఈ వివాహం అనంతరం యువతిని తన ఇంటికి కూడా తీసుకువచ్చారని నజ్రీన్ తెలిపారు. 11 మంది పిల్లలకు తండ్రైన ఖలీల్, గతంలో కొందరికి విడాకులు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై నజ్రీన్ SP కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.