గుజరాత్లోని అహ్మదాబాద్లో సభ్యసమాజం తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దరియాపూర్ ప్రాంతంలో ఓ తండ్రి తన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. దీనికి ఫలితంగా బాధిత బాలిక ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఏడాదిగా కుమార్తెపై తన భర్త అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.