తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ లారీ డ్రైవర్ తన 15 ఏళ్ల కుమార్తెపై మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని, బాలిక గర్భవతి అయిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం బాలిక తల్లికి చెప్పడంతో తండ్రి వారిని ఇంట్లోంచి గెంటేశాడని సమాచారం. బాధితురాలు బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును పెరవలి పోలీసులకు బదలాయించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.