2020లో భారత్-చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణను ఆధారంగా చేసుకొని దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్న చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే లద్దాఖ్లో జరిగిన ఆ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు తుపాకులు లేకుండా కర్రలు, రాళ్లతో తలపడటం తీవ్ర సంచలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తెలుగు జవాన్ కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.