TG: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఇవాళ కోర్టు తుది తీర్పును వెలవరించనుంది. దీంతో న్యాయస్థానం వెల్లడించే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూతురు అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబరు 14వ తేదీన మిర్యాలగూడలో ప్రణయ్ను హత్య చేయించాడు. ఈ కేసులో ఏ-1 ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులుగా ఉన్నారు.