మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్పై కేసు నమోదయింది. ఢిల్లీకి అందే యమునా నది నీటిలో హరియాణా విషం కలుపుతోందని చేసిన ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్పై సోనిపట్లో FIR నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికార-విపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగాయి. కేజ్రివాల్ వ్యాఖ్యలు జాతికే అవమానం అని ప్రధాని మోదీ మండిపడ్డారు. యమునా నది నీటిని హరియాణా CM నాయబ్ సింగ్ తాగి ఆరోపణలను తిప్పికొట్టారు.