యూపీలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా పార్కింగ్ చేసిన కారులో శనివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక కారు పూర్తిగా దగ్ధమవ్వగా.. మరో కారు స్వల్పంగా దెబ్బతింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.