ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణాపాయం

AP: ఆంధ్ర–ఒడిశా ఘాట్‌ రోడ్డుపై పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి జయపూర్‌ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని రొడ్డవలస వద్ద చోటుచేసుకుంది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి, ప్రయాణికులను సమయానికి దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.

సంబంధిత పోస్ట్