TG: రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్ ప్లాజా వద్ద జరిగింది. గనుగపూర్ నుండి హైదరాబాద్ వస్తున్న కారు.. జాతీయ రహదారి పక్కన హోటల్ వద్ద ఆపారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కారులో మంటలు వచ్చాయి. వెంటనే స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వేసవిలో ప్రమాదాలు జరగకుండా వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.