యూపీలోని వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో ప్రమాదవశాత్తు కాల్పులు చోటుచేసుకున్నాయి. నందు ఫరియా గేట్ వద్ద ఓ PAC జవాన్ చేతిలోని కార్బైన్ తుపాకీ ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో ఈ ఘటన జరిగింది. కిందపడిన వేగంలో ఆ ఆయుధం రెండుసార్లు పేలింది. బుల్లెట్ల నుండి వెలువడిన పెల్లెట్లు అక్కడ పూలు, దండలు అమ్ముకునే ముగ్గురు దుకాణదారులకు తగిలడంతో వారు గాయపడ్డారు.