ఇంగ్లాండ్‌తో రేపే తొలి టీ20.. వైభవ్ అరంగేట్రంపై ఆసక్తి

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఓటమి నుంచి కోలుకున్న టీమ్ఇండియా, రేపటి నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఐర్లాండ్‌పై వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయనప్పటికీ, ఇంగ్లాండ్‌పై అతనికి అవకాశం దక్కే అవకాశాలున్నాయి. తొలి టీ20లోనే వైభవ్ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లో ఒకరిని బెంచ్‌కే పరిమితం చేసి, వైభవ్‌ను అభిషేక్‌తో కలిసి ఓపెనింగ్‌కు పంపే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్, ఇంగ్లాండ్ పిచ్‌లపై ఎలా ఆడతాడో చూడాలి.

సంబంధిత పోస్ట్