రోజువారీ యోగాకు సమయం లేదనుకునేవారికి, కేవలం ఐదు నిమిషాల సింహాసనం అద్భుత మార్పులు తెస్తుంది. ఈ ఆసనం ముఖ కండరాలకు శక్తినిచ్చి, గొంతు సమస్యలను దూరం చేస్తుంది. ముఖంపై ముడతలు తగ్గించి, రక్త ప్రసరణను పెంచి సహజ మెరుపునిస్తుంది. గొంతు నొప్పి, టాన్సిల్స్, థైరాయిడ్ సమస్యలకు, మాట స్పష్టత లేని పిల్లలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. కోపం, ఒత్తిడి వంటి ప్రతికూల భావోద్వేగాలను బయటకు పంపి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని యోగా నిపుణులు చెప్తున్నారు.