కర్ణాటకలోని కలబురగిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజ్కుమార్ పాటిల్ తేల్కూర్.. బుధవారం కరువు సాయం కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఓ బైకర్పై దురుసుగా ప్రవర్తించారు. డీసీ కార్యాలయం వద్ద ఆ బైకర్ హెల్మెట్ను లాక్కుని నేలకేసి కొట్టి పగలగొట్టడమే కాకుండా, అతని ద్విచక్రవాహనం టైర్లలోని గాలిని కూడా తీసేశారు. ఈ ఘటన కలబురగిలో బీజేపీ చేపట్టిన కరువు నిరసనలో చోటుచేసుకుంది.