మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం 6:30 గంటల సమయంలో తరగతి గదిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.