అమరుల ఆశయాలు నెరవేర్చాలి

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరులైన అమరవీరుల ఆశయాలు నెరవేర్చాలని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సంఘాల నాయకులు మద్దిలేటి, వెంకటయ్య, బీసీ ఐక్యవేదిక నాయకులు రామాంజనేయులు గౌడ్, కేఎన్ పి ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్