నారాయణపేట పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి పాటలకు నృత్యాలు, ప్రదర్శనలు ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ జాగిలాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులను ముఖ్య అతిథిగా వచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ అభినందించారు.