నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.