కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్స్ లాంటి సంక్షేమ పథకాల ఇప్పిస్తామని పైరవీ దారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి లబ్ధిదారులకు సూచించారు. వనపర్తి జిల్లా పెద్ద మందడిలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి పని, సంక్షేమ పథకాలు పారదర్శకంగా కొనసాగుతాయని, ఎక్కడ ఎవరికీ ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.