వనపర్తి జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 8,167 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ఆర్. సునీత తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రజనితో కలిసి లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్ లో ప్రీ లిటిగేషన్ 5,000, సివిల్ 15, క్రిమినల్ 2, 552, మొత్తంగా 8, 167 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.