పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం బల్మూరు మండలం మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు తెలుపుతున్న నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ప్రొఫెసర్ హరగోపాల్ ను, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనమని అన్నారు.